ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 190వ రోజుకు చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం నుంచి ఆయన తన పాదయాత్రను కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి నాలుగు సంవత్సరాలు దాటుతున్నా..ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ది చేస్తున్నామని మాయ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని..అక్రమార్కులకు పెద్ద పీట వేస్తూ..ప్రజలను దారుణంగా దోచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.