ఈ మద్య మహిళలపై పురుషుల అఘాయిత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.  ప్రతిరోజూ ఎక్కడో అక్కడ యువతులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి.  తాజాగా కరీంనగర్‌లో కలెక్టరేట్ దగ్గర దారుణం జరిగింది.  ఓ  యువతిని దారుణంగా గొంతు కోశాడు యువకుడు.  రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆ యువతిని స్థానికులు ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోపు చనిపోయింది. 

యువతిని పై దారుణానికి ఒడిగట్టిన యువకుడు అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేసేలోపు స్థానికులు అతన్ని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు.  అయితే ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తుండగా.. నిందితుడిని కూడా ప్రశ్నిస్తున్నారు. మృతురాలిని రామగుండం హనుమాన్ నగర్‌కు చెందిన రసజ్ఞగా గుర్తించారు.

మూడ నెలల క్రితం ఆమె కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఈ-సేవా కేంద్రంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా,  నిందితుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంకు చెందిన వంశీధర్‌ అని పోలీసులు చెప్పారు. తనతో పర్సనల్ గా ఓ విషయం చెప్పాలని పిలిచిన ఆ యువకుడు ఒక్కసారే యువతిపై కత్తితో దాడి చేశాడని స్థానికులు అంటున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: