బనగానపల్లె మాజీ ఎంఎల్ఎ కాటసాని రామిరెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. కాటసాని రామ్ రెడ్డి కుమారుడు కాటసాని నాగార్జున రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. తన ఇంట్లోనే ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది.  ఈ మధ్యకాంలోనే నాగార్జున బిటెక్ పూర్తిచేసి ఇంటి దగ్గరనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి కుటుంబ సభ్యలతో కలిసి భోజనం చేసి తన బెడ్ రూంలో నిద్రపోయాడు.

శుక్రవారం ఉదయం ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో కిటికీలోంచి చూడగా నాగార్జున రెడ్డి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. చేతికి అందొచ్చినా కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో కాటసాని రామిరెడ్డి కుటుంబమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. నాగార్జునరెడ్డి ఆత్మహత్య వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకునేందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదన్న మనస్తాపంతో ఆయన ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని భావిస్తున్నామని అన్నారు. గత రాత్రి తన తండ్రితో కలసి బెంగళూరు నుంచి బనగానపల్లికి వచ్చిన నాగార్జున రెడ్డి, తండ్రితో తన పెళ్లి విషయమై వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది.

బనగానపల్లిలో నాగార్జున రెడ్డి ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతుండగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.   కుటుంబ సభ్యల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: