మనంకు కష్టమొస్తే..దేవుడిని ప్రార్థిస్తాం..ఆరోగ్యపరంగా ఏవైనా ఇబ్బందులు వస్తే..నయం చేయమని డాక్టర్ ని వేడుకుంటాం. కానీ ఈ మద్య కొంత మంది డాక్టర్లు కామాంధులుగా మారి పెషెంట్స్ పై అకృత్యాలకు పాల్పపడుతున్నారు.  తాజాగా కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన ఏడునెలల గర్భిణిపై ఓ ఆర్ఎంపీ డాక్టరు అత్యాచారానికి పాల్పడ్డాడు.
Image result for pregnant women
ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, హత్యలు కొనసాగుతున్నాయని..ప్రభుత్వం ఎంత కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ఇలాంటి కామాంధుల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు.  కడుపు నొప్పితో వచ్చిన గర్భిణిపై ఆర్ఎంపీ డాక్టరు అత్యాచారానికి పాల్పపడటం తీవ్ర కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే..గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిందీ ఘటన. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే మహిళకు అర్ధరాత్రి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది.

భర్త సాయంతో సమీపంలోనే ఉన్న క్లినిక్‌కు వెళ్లింది.  ఆమెను పరీక్షించిన డాక్టర్ కొన్ని మందులు తీసుకు రావాలని భర్తను మెడికల్ స్టోర్ కి పంపిన తర్వాత తన వికృత రూపం రూపించారు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: