పవర్ స్టార్ పవన్ కళ్యాన్  ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత జనసేన పార్టీని దాని సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించడానికి సిద్దమయ్యారు.  ఈ నేపథ్యంలో ఆయన ఉత్తరాంధ్ర పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే.  హీరోగా మంచి ఫామ్ లో ఉన్న పవన్ కళ్యాన్ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి ‘జనసేన’ పార్టీ స్థాపించారు.

ప్రజలు ఎలాంటి కష్టాల్లో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీస్తానని హామీ ఇచ్చిన ఆయన ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.  నేడు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ ట్వీట్ లో తన సంతోషం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ లోని తన నివాసంలో రంజాన్ పండగ జరుపుకున్నానని, తనపై ప్రేమ చూపించే ప్రతిఒక్కరికి, సన్నిహితులకు ఈ పవిత్రమైన రోజున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి తాను ఉన్న ఓ ఫొటోను పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: