రోజు రోజుకీ సమాజంలో కొన్ని వార్తలు చూస్తుంటే...పవిత్రమైన వివాహ బంధాలు ఎంతగా బ్రస్టుపట్టిపోతున్నాయో అనిపిస్తుంది.  కట్టుకున్న భర్తను ప్రియుడి కోసం కడతేరుస్తున్న మహిళల ఉదంతాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.  ఓ వైపు మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు కొనసాగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అగ్ని సాక్షిగా తాలికట్టిన భర్తలను దారుణంగా హతమారుస్తున్న మహిళల ఉదంతాలు బయట పడుతున్నాయి.
Image result for andhrapradesh murder
తాజాగా నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఓ వ్యక్తి అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు.  ఈ కేసులో ప్రధమ ముద్దాయి ఆయన భార్య అని తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 45 రోజుల క్రితం జిల్లాలోని కల్వకుర్తి పట్టణం హనుమాన్‌ నగర్‌ కాలనీకి చెందిన తన భర్త కావలి మల్లయ్య కనిపించడం లేదంటూ పార్వతమ్మ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన గమనిస్తూ వస్తున్న పోలీసులు తమదైన స్టైల్లో ఆమెను విచారించారు. 

అప్పుడు పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు బయట పడ్డాయి. భార్య పార్వతమ్యే తన భర్తను చంపినట్టు బయటపడింది. పార్వతమ్మకి రాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. భర్త అడ్డు తొలగించాలనుకున్న పార్వతమ్మ తన ప్రియుడు రాములు, కొడుకు  శ్రీకాంత్‌లతో కలిసి భర్తను హత్యచేసింది.
Related image
ఆ తర్వాత అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బస్తాలో కట్టి గనూల్‌ చెరువులో పడేశారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ పార్వతమ్మ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  ఈ కేసులో తమదైన శైలిలో దర్యాప్తు చేసిన పోలీసులు పార్వతమ్మే హత్య చేసినట్టు నిర్ధారించారు. దీంతో పార్వతమ్మ, ప్రియుడు రాములు, కొడుకు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: