గతంలో 2014 ఎన్నికలలో కాపు ప్రజలకు మాయమాటలు చెప్పి వారి ఓట్లను తెలుగుదేశం పార్టీకి పడేలా చేసుకొని అధికారంలోకి వచ్చాక వారిపై వ్యవహరిస్తున్న తీరుకు కాపు నేతలు మండిపడుతున్నారు. ఈ నేపద్యంలో రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు కాపులంతా సిద్ధంగా ఉన్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వంగవీటి మోహనరంగాను హత్య చేసిన తర్వాత టీడీపీని కాపులు ఓడించారని చెప్పారు.
కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పిన చంద్రబాబు. ఆ తర్వాత మోసం చేశారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. 13 జిల్లాల కాపు ప్రతినిధులతో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. అవసరాన్ని బట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కూడా చర్చలు జరుపుతామని చెప్పారు.
కాపులకు ఇచ్చిన హామీలపై ఆనాడు నేను ఉద్యమం చేస్తే నన్ను నా కుటుంబాన్ని తీవ్రంగా అవమానాలు చేశారు చంద్రబాబు అంటూ..చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు ముద్రగడ్డ పద్మనాభం. ఇంత దారుణంగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు భవిష్యత్తు రాజకీయాలలో రాణించలేరు అంటూ హెచ్చరించారు.