దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పై మీడియా కళ్లు ఉన్నాయి. మరిముఖ్యంగా టీడీపీ పార్టీ ఎన్డిఎ కూటమి నుండి బయటికి వచ్చిన తరువాత ప్రధాని మోదీని మొదటిసారి కలవబోతున్నారు.దీంతో మీడియా ఫోకస్ మొత్తం వీరిద్దరిపైనే ఉంది. సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ తన సీటులో కూర్చున్నారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు మోదీతో షేక్ హ్యాండ్ ఇచ్చారు.
ఆ సమయంలో మోదీ చంద్రబాబును పెద్దగా పట్టించుకోలేదు. మోదీ చంద్రబాబును పట్టించుకోకుండానే వెళ్లి, తన సీటులో ఆశీనులయ్యారు. దీంతో ఈ సన్నివేశాన్ని చూసిన అక్కడ కొంతమంది నాయకులు ప్రధాని మోడీ చంద్రబాబు విషయంలో ఏ విధంగా ఉన్నారో అర్థమైంది..దీనంతటికి కారణం చంద్రబాబే వైఖరే అని అంటున్నారు సమావేశానికి వచ్చిన నాయకులు.
అయితే మరోపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే ఆ పార్టీకి కొమ్ముకాసే మీడియా మాత్రం బయటికి వేరేలా అంటే మోడీ పై చంద్రబాబు తిరగబడ్డాడు అన్న విధంగా ప్రసారాలు కార్యక్రమాలు చిత్రీకరిస్తోంది. మొత్తంమీద చూసుకుంటే చంద్రబాబుని కనీసం కూడా పట్టించుకోలేదు మోడీ అని అంటున్నారు ఆ సమావేశంలో పాల్గొన్న నాయకులు.