కర్నూలు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా తనకు తిరుగులేదని, వచ్చే ఎన్నికల్లోనూ తనకే గెలుపు తథ్యమని ఇప్పటి వరకు చెబుతూ వస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మంత్రి అఖిల ప్రియకు కౌంట్ డౌన్ స్టార్టయిందనే వ్యాఖ్యలు జోరం దుకున్నాయి. ఇక్కడి రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. విషయంలోకి వెళ్తే.. ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిల ప్రియ.. వచ్చే ఎన్నికల్లోనూ ఈ టికెట్ ఆశిస్తున్నారు. అయితే, ఈ టికెట్ను తనకు కేటాయించాలని టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి కోరుకుంటున్నారు. దీంతో ఇక్కడ ఇరువురు నేతలు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ.. టికెట్ రాజకీయాలు మాత్రం ప్రత్యర్థుల స్థాయిని మించిపోయాయి. ఒకరిపై ఒకరు మాటల యుద్ధాన్ని దాటి.. చేతల పోరు వరకు కూడా చేరిపోయింది పరిస్థతి.
ఇక, రానున్న ఎన్నికల్లో అఖిలకు టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె.,. వయసు, అనుభవంలోనూ చిన్నదే అయినా.. అదినేత చంద్రబాబు ఆదేశాలు, మాటలను పెడచెవిన పెట్టడంలో సీనియర్లనే మించిపోయిందనే వ్యాఖ్యలు జోరందుకున్నాయి. అదేసమయంలో నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదని, ప్రతి పనికీ కమీషన్లు రాబడుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక, మరో రీజన్.. వైసీపీ నేతలతో ఆమె టచ్లో ఉండడం. నిజానికి ఆమెకు సంబంధం లేని నియోజకవర్గానికి వెళ్లి .. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే.. కాటసాని రాంభూపాల్ రెడ్డితో అంటకాగుతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
కాంట్రాక్టులు కూడా మంత్రి హోదాలో కాటసాని మనుషులకే కేటాయిస్తున్న వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు టికెట్ దక్కే పరిస్థితి కూడా కనిపించడం లేదని, చంద్రబాబు అక్కడ జరుగుతున్న ప్రతి పరిణామా న్నీ గమనిస్తున్నారని అంటున్నారు. ఒకవేళ.. బాబు.. టికెట్ ఇచ్చినా.. వ్యతిరేక ప్రచారంతో ఆమెను చాపకింద నీరుగా ఓడించేందుకు ఏవీ సుబ్బారెడ్డి రెడీ గా ఉన్నారు. వీటన్నింటినీ పక్కన పెడితే.. ప్రముఖ పారిశ్రామిక వేత్త, నియోజకవర్గం లో ఆర్థికంగా రాజకీయ నేతలకు వెన్నుదన్నుగా ఉన్న శూలం రామకృష్ణ నేరుగా రాజకీయాల్లోకి దిగుతున్నారు. ఈయన బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో దాదాపు టీడీపీ తీర్థమే పుచ్చుకునే అవకాశం మెండుగా ఉంది.
ఒకపక్క అఖిల మరోపక్క ఏవీ సుబ్బారెడ్డిలు పోటీ పడుతున్న క్రమంలో ఎవరికి టికెట్ ఇచ్చినా.. ప్రయోజనం వైసీపీకే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శూలం రామకృష్ణ ఎలాగూ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో నేరుగా ఆయనకేటికెట్ ఇస్తే.. ఏ గొడవా ఉందనే వార్తలు టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇదే జ.రిగితే.. అఖిలకు టికెట్పై పూర్తిగా ఆశలు గల్లంతైనట్టే!! మరి ఏం జరుగుతుందో చూడాలి.