ఈ మద్య దేశంలో ఎక్కడ చూసినా ఆడవారిపై అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. దారణం ఏంటంటే..కొంత మంది కామాంధులు చిన్నపిల్లలు, వృద్దులు అని కూడా చూడకుండా వారిపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. తమ గుట్టు ఎక్కడ బయట పడుతుందో అని వారిని ఘోరంగా హతమారుస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో ఓ పదేళ్ల బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారం చేసి బండరాయితో దారుణంగా చంపిన సంఘటన కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే..సోన్కు చెందిన బాలిక(10) ఐదో తరగతి చదువుతోంది.
శనివారం సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన తోకల ప్రవీణ్ కుమార్, తోకల గణేశ్లు చిన్నారికి మాయమాటలు చెప్పి సమీపంలోని పాత కూచన్పల్లి గ్రామ పొలిమేరలోకి తీసుకెళ్లారు. తర్వాత ఆ బాలికపై బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టారు. తమ గుట్టు బాలిక ఎక్కడ చెబుతుందో అని బండరాయితో తల పగలగొట్టి చంపారు. సాయంత్రం నుంచి తమ కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు గ్రామమంతా వెతికారు. ఫలితం లేకపోవడంతో రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చిన్నారి కోసం పోలీసులు రాత్రి నుంచే గాలింపు మొదలుపెట్టారు. బాలిక కిడ్నాప్పై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. వాట్సాప్ ద్వారా విషయం తెలుసుకున్న సోన్ గ్రామానికే చెందిన దాసరి శ్రీనివాస్.. శనివారం సాయంత్రం బాలికను ప్రవీణ్ కుమార్, గణేష్లు మోటార్ సైకిల్పై తీసుకువెళుతుండగా చూశానని తెలిపాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిద్దిరినీ అరెస్ట్ చేసి తమదైన స్టైల్లో విచారించారు.
దాంతో ఆ దుర్మార్గులు అసలు విషయం చెప్పారు. కూచన్పల్లి పొలిమేరలో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. పాప తలను బండరాయికి మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. చిన్నారి మృతదేహాన్ని చూసి పోలీసులు సైతం చలించిపోయారు. కాగా, ఆ ఇద్దరు కామాంధులకు మరణ శిక్ష విధించాలని..ని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీసులు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయడంతో కేవలం 12 గంటల్లోనే కేసును ఛేదించగలిగారని చెబుతున్నారు.