ఈ మద్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఓ వైపు ప్రభుత్వం హైవే పై ఎన్ని నియమనిబంధనలు పెట్టినా..కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి.  కొన్ని సార్లు ప్రకృతి విపత్తు వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ పిల్లాడు రోడ్డు దాటుతుంటే..అతన్ని తప్పించబోయిన తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటన హృదయాలను కలిచి వేస్తుంది. 

బీహార్ లోని అరారియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.  పోలీసుల వివరాల ప్రకారం..ప్రమాదానికి గురైన స్కార్పియో వాహనంలో చిన్నారులతో పాటు నలుగురు పెద్దలు ఉన్నారు. దబ్రా గ్రామం సమీపంలోకి రాగానే... ఓ పిల్లాడు రోడ్డుకు అడ్డంగా వచ్చాడు.  అకస్మాత్తుగా ఆ పిల్లాడు రోడ్డు పైకి రావడంతో...అతన్ని తప్పించాలని ప్రయత్నించాడు డ్రైవర్.

దీంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును వాహనం ఢీకొని, పక్కనే ఉన్న చెరువులోకి పడిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురు పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: