వైసీపీ పార్టీ నాయకుడు పార్థసారథి తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇటీవల మీడియా సమావేశంలో పార్థసారధి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గత నాలుగు నెలల నుండి భయాందోళనకు గురవుతున్నారని విమర్శించారు. దానికి కారణం గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో చేస్తున్న అవినీతి అంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వారు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నారని మరియు అదే విధంగా ఆ బురదను ఇతరులమీద చల్లడానికి అడ్డమైన దారులు తొక్కుతున్నారని అన్నారు.
Related image
ముఖ్యంగా తమ అనుకూల మీడియా ను ఉపయోగించి తెలుగుదేశం నేతలు చేస్తున్నా చీప్ పాలిటిక్స్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని గత నాలుగు సంవత్సరాలుగా అడ్డగోలుగా దొరికిందల్లా కాజేసి రాష్ట్రానికి కేంద్రం నుండి రావలసిన నిధుల విషయంలో కూడా కర్కశంగా వ్యవహరించి చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న ప్రజలను తీవ్ర ఇబ్బందులు పాలు చేశారని పేర్కొన్నారు పార్థసారథి.
Related image
ఇటీవలే సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో మోడీ ని కడిగేస్తారు , నిలదీస్తారు అని టీడీపీ బ్యాచ్ అండ్ ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ బాబు ఆ సమావేశంలో ఒక్క మాట కూడా మోడీ కి వ్యతిరేఖంగా మాట్లాడలేదని అన్నారు . కేంద్రానికి వ్యతిరేఖంగా మాట్లాడితే తన వీపు ఎక్కడ విమానం మోత మోగిస్తారో అని చంద్రబాబు భయపడ్డారని పార్ధ సారథి విమర్శించారు.
Related image
ఆయన ప్రవర్తన చూస్తుంటే ఏపీ ప్రజలు తల దించుకునే విధంగా చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ముందునుండి ఢిల్లీలో ఒక మాట రాష్ట్రంలోకి వచ్చాక మరో కల మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు పార్ధసారధి. ఇటువంటి వైఖరి కలిగిన చంద్రబాబుకి వచ్చేఎన్నికలలో తగిన విధంగా ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: