ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు దీక్షల పర్వం కొనసాగుతుంది.  ధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్రమంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌కు టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ సోమవారం కడప స్టీల్ ప్లాంట్ అంశంపై లేఖ రాశారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆయన ఆ లేఖలో కోరిన విషయం తెలిసిందే.  'ఉక్కు దీక్ష' పేరుతో కడప జిల్లా పరిషత్ ప్రాంగణంలో సీఎం రమేశ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఇందుకు సంబంధించి టీడీపీ శ్రేణులు దీక్షా వేదికను సిద్ధం చేశాయి.
CM Ramesh letter to PM and Union Minister for Kadapa Steel plant
సీఎం రమేష్‌తోపాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఈ దీక్షలో పాల్గోనున్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో సీఎం రమేష్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి మెకాన్ సంస్థ ఇచ్చిన సాధ్యాసాధ్యాల నివేదికను పరిశీలించాలని కూడా ఆయన కోరారు.ప్లాంట్ ను ఏర్పాటు చేయకుంటే ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

మెకాన్‌ సంస్థ తాజా నివేదిక ప్రకారం సాధ్యమైనంత త్వరగా కడప జిల్లాలో సమీకృత ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కడప, బయ్యారంలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు సాధ్యంకాదంటూ ఇటీవల సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడ్‌విట్ దాఖలు చేయడంతో ఏపీ, తెలంగాణల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.  ఇక తన దీక్ష సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, వైకాపా ఎంపీల మాదిరిగా తాను దొంగ దీక్షలకు దిగడం లేదని, ఆమరణ దీక్షకు కూర్చోనున్నానని తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: