ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయ వారసుల జోరు బాగా కొనసాగుతుంది.  తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఐటీశాఖ, పంచాయతీరాజ్ మంత్రిగా తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబు సైతం ఐటీ, పంచాయతీరాజ్ మినిస్టర్ గా కొనసాగుతున్నారు. 
Image result for chandrababu lokesh
టెక్నాలజీ వాడకం విషయంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపంచుకుంటున్నా నారా లోకేష్ కు  మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. లోకేశ్ ను స్కోచ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపిక చేశారు. పంచాయతీరాజ్ శాఖలో టెక్నాలజీ వినియోగం ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినందుకు గాను ఈ అవార్డు లభించింది.
Image result for chandrababu lokesh
గవర్నెన్స్, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖకు మరో 3 అవార్డులు లభించాయి. ఈ నెల 23న ఢిల్లీలో జరగనున్న స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును లోకేశ్ అందుకోనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: