తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ ప్రతిష్టత పెంచేందుకు పర్యటన కొనసాగిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర లో ‘రాట యాత్ర’ ప్రారంభించి శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ప్రజలతో కలిసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  పవన్ కళ్యాన్ మూడు నెలలుగా బాధిస్తున్న కంటి సమస్యకు ఈ విరామ కాలంలో చిన్నపాటి శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం తిరిగి యాత్రను ప్రారంభిద్దామనుకున్నారు.

తన వెంట వుండే సిబ్బందిలోని ముస్లిం సోదరుల కోసం రంజాన్ పండుగ సందర్భంగా విశాఖ జిల్లా యాత్రకు విరామం ఇచ్చిన సంగతి విదితమే. ఈ నెల 24 న శస్త్ర చికిత్స చేయాలని ప్రసాద్ కంటి ఆసుపత్రి డాక్టర్లు నిర్ణయించారు. అయితే, తాజాగా జరిగిన వైద్య పరీక్షలను పరిశీలించిన డాక్టర్లు శస్త్ర చికిత్సకు ఇంకొంత కాలం ఆగాలని సూచించడంతో పోరాట యాత్రను తిరిగి ప్రారంభించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. 
Image result for pawan kalyan srikakulam tour
విశాఖ జిల్లా అనంతరం పోరాట యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభం అవుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో పోరాట యాత్ర సన్నాహాలలో ఆ జిల్లా జనసేన నేతలు నిమగ్నమై వున్నారు.జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో పర్యటించడంతో పాటు ఉత్తరాంధ్ర మేధావులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యే అవకాశం వుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: