ఉభయ తెలుగు రష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న షికాగో సినీ తారల వ్యభిచారం కేసు చీమలు పెట్టిన పుట్టల్లో దర్జాగా జీవించిన జీవిస్తున్న భవిష్యత్ లో జీవనానికి ప్రణాలిక సిద్ధం చేసుకున్న సుఖ సంభోగ జల్సారాయుళ్లకు దేహంలోపల్నించి జలదరింపులు పుట్టిస్తుంది. దేహంలో భూకంపాన్ని ఇప్పుడు చవిచూస్తున్నారు సినీ జీవులు, విటులుగా మారి నీతి తప్పిన తెలుగు రాజకీయ ప్రముఖుల సుఖభోగ విలాస జల్సా రాయుళ్ళు.
చేతికి అందివచ్చిన చిత్తుకాగితం ఒక "పేపర్ ట్రయిల్" గా మారి వీరి చరిత్ర మొత్తం తవ్వితీస్తున్న అమెరికా ఎఫ్.బి.ఐ పోలీసు విభాగం ఇప్పుడు దర్యాప్తులో పెంచిన వేగం తొలుత ఇదేదో మోదుగుమూడి కిషన్ చంద్రకళ దంపతుల అక్రమ లైంగిక వ్యాపార వ్యవహారం నుండి ఆరుగురు సినీతారలు, ప్రముఖ స్థానాల్లోని విటులకు చేధించు కుంటూ ముందుకు కొనసాగుతుంది. అమెరికాలోని తానా నిర్వహించిన పలు సాంస్కృతిక సంస్థల పేర్లతో టాలీవుడ్ నుండి ఇతర విధాలుగా మహిళలను అమెరికా రప్పించి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని అమెరికా పోలీసులు దృఢంగా అనుమానిస్తున్నట్లు సమాచారం.
ఈ పాములు నివసించే చీమల పుట్టలను బ్రద్ధలు చేసేంతవరకు "ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికార యంత్రాంగం" విశ్రమించేలాగా లేదు. దర్యాప్తు బహుముఖాలుగా అంటే అన్ని కోణాల్లోనూ నో స్టోన్ అన్ టరండ్ గా చేస్తున్నారట. అమెరికాలోని వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులను విచారించిన అధికారులు గత కొన్ని సంవత్సరాలుగా ఆయా సన్స్థల కార్యక్రమాలపై డేగకన్ను పెట్టి నట్లు - వాతికి అతిధులుగా, ఆహ్వానితులుగా హాజరైన వారి వివరాలను మన దేశం లోని "అమెరికా కాన్సులేట్ కార్యాలయల" నుంచి తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు వారి ఆర్థిక లావాదేవీలనూ ఆరా తీస్తున్నట్లు కూడా సమాచారం. తాము సినీతారలను పిలిపిస్తుంటామని, సాంస్కృతిక కార్యక్రమాల వరకే తమకు తెలుసని వివిధ సంఘాల వారు చెప్పినట్లు తెలుస్తోంది. నటీ నటులు వచ్చి వెళ్లడానికి విమాన టిక్కెట్లు, బస చేయడానికి హోటల్ గదులకయ్యే ఖర్చు మాత్రమే చెల్లిస్తామని, ఆర్థికంగా ప్రయోజనాలేవీ కల్పించిన సాంప్రదాయం తమ సంఘాలకు లేదని ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం.
కాని కొందరు నటీమణుల ఖాతాల్లో పెద్ద మొత్తంలో డాలర్లు ప్రవహించినట్లు, అంతేకాదు ఆర్ధిక ప్రయోజనాలను ఇసుమంతైనా వదలని ఈ నటీమణులౌ కొందరు రిటర్న్ జర్నీలో తమకు జమ పడ్ద డాలర్లను రూపాయలుగా కూడా మార్చుకున్నారని షికాగో ఎఫ్.బి.ఐ పోలీసు విభాగం గుర్తించినట్లు సమాచారం. వ్యభిచారం కేసు లో అరెస్టై ప్రస్తుతం జైల్లో అసాంఘిక నేరస్తులుగా నేరాభియోగంతో ఊచలు లెక్క పెడుతున్న మోదుగుమూడి చంద్ర-కిరన్ దంపతులను గురువారం నేడు (21.06.2018) ఇల్లినాయిస్ జిల్లా న్యాయస్థానంలో ప్రవేశ పెట్టనున్నారు.
వాళ్ళు మన పోలీసులు కాదు చంద్రులు సూర్యులు చెపితే వినటానికి, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికార యంత్రాంగం.
కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ ను కుదిపేస్తుంటే, ఇప్పుడు అమెరికాలో టాలీవుడ్ తారల సెక్స్-రాకెట్ వెలుగులోకి వచ్చి పెను సంచ లనం రేపుతోంది. మోదుగుమూడి కిషన్ దంపతుల అరెస్ట్ తో ఈ విషయం హాట్-టాపిక్ గా మారింది. ఈ విషయంపై ఇప్పటికే పలువురు స్పందించారు. తమకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైనట్లు వెల్లడించారు. తాజాగా నటి శ్వతా బసు ప్రసాద్ కూడా ఈ విషయంపై కామెంట్ చేసింది.
తాజాగా ఒక మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్వేతా బసు ప్రసాద్ మాట్లాడుతూ, అమెరికాలో తనకు గతంలో జరిగిన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. తెలుగు సంఘాలవారు పిలిచిన ఈవెంట్ కు వెళ్లిన సమయంలో, తనకు ఫైవ్-స్టార్ హోటల్ బుక్ చేశారని, కార్యక్రమం ముగిసిన వెంటనే తిరుగు ప్రయాణం సమయంలో, ఫ్లైట్ మిస్ కావడంతో చేసే దేమీ లేక మళ్లీ హోటల్ కే వెళ్లానని తెలిపింది. ఆ సమయంలోనే కొందరు యువతులను హోటల్ నుంచి అరెస్టు చేసి తీసుకు పోతుండటాన్ని గమనించానని తెలిపారు. అప్పటి వరకు ఆ హోటల్ లో వ్యభిచారం జరుగుతున్నట్టు తనకు కూడా తెలియ దని, పోలీసులు యువతులను అరెస్టు చేసి తీసుకుపోతుండటాన్ని చూసి షాక్ అయినట్టు శ్వేతా బసు ప్రసాద్ చెప్పింది.