సిద్దిపేటలో జిల్లాలో గురువారం విషాదం చోటు చేసుకుంది. జిల్లాకేంద్రంలోని భారత​ నగర్‌లో ఓ కుటుంబం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికంగా నివాసముంటున్న హనుమంతరావు అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.  తాము వెళ్లిపోతే తమ పిల్లలు అనాథలు అయిపోతారని భావించినట్టున్నారు. తమ నలుగురి చావుకు కారణాలు తెలుపుతూ సూసైడ్ నోట్ రాసి, పిల్లలకు విషం ఇచ్చి, వారిద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.
Three Of Family Commits Suicide In Siddipet District - Sakshi
 ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా తండ్రి చనిపోయాడు. భార్య పరిస్థితి విషమంగా వుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొండపాక మండలం ఆంధ్రభూమి రిపోర్టర్ గా ( జర్నలిస్ట్ ) పనిచేస్తున్న హన్మంత్ రావు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, అప్పులు ఇచ్చినవారి నుంచి వేధింపులు ఎక్కువ అయి, పెట్టిన వ్యాపారం దెబ్బతినడంతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. కటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: