ఈ మద్య ఎలుకలు సృష్టిస్తున్న బీభత్సాలు చూస్తే నిజంగా షాక్ తినక మానరు.  మొన్న వరంగల్‌లోని హోటల్లో ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా వంకాయ కూరలో ఎలుక కనిపించింది. నిన్న అస్సాంలోఏటీఎం మిషన్‌లోకి  దూరిన ఓ ఎలుక నోట్ల కట్టలను ముక్కలు ముక్కలుగా కొరికేసింది.  తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది ఎలుక. 
Image result for burger
వివరాల్లోకి వెళితే..అమెరికాలోని ఒక్లహోమా రాష్ట్రం  కటూసాలో ఉన్న వెండీ రెస్టారెంట్‌లో చోటు చేసుకుంది. బర్గర్లను తయారు చేయడానికి వాడే బన్స్ ప్యాకెట్లో ఓ మూషికరాజం చక్కగా కూర్చుని  దర్శనమిచ్చింది. దీంతో రెస్టారెంట్లోనే పనిచేస్తున్న స్కై ఫ్రేమ్ అనే మహిళ.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Image result for mouse
అంతేకాకుండా, ఆ  వెండీ రెస్టారెంట్‌లో ఏదీ తినకండి… అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. అంతే కాదు ఆ కిచెన్ ఎంత అధ్వాన్నంగా ఉందో చూడండి..సిగర్ పీకలు పడి ఉన్నాయి..అంటూ మరో క్యాప్షన్ పెట్టింది. దాంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  దీనిపై స్పందించిన రెస్టారెంట్ యాజమాన్యం ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: