తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన షికాగో సెక్స్ రాకెట్ కేసు వెనుక పలువురు తెలుగుదేశం పెద్దల హస్తం ఉందని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా- (తానా) ప్రెసిడెంట్ సతీష్ వేమన చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ కు సన్నిహితుడైనందున ఏపీ ముఖ్యమంత్రి దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడి వైసిపి ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ వాసిరెడ్డి పద్మ “షికాగో సెక్స్ రాకెట్” కేసు గురించి పలు వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి విషయాలతో అమెరికాలో ఉంటున్న తెలుగువారి పరువు తీశారంటూ, వారి గౌరవ ప్రతిష్ఠలకు మచ్చ తెచ్చారంటూ ఆమె మండిపడ్డారు. గతంలో ఏపీ లో కలకలం రేపిన “కాల్మనీ సెక్స్ రాకెట్” పై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నిస్తే, ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. “కాల్మనీ సెక్స్ రాకెట్ కేసు” లో టీడీపీ నేతలు ఉండటంతో ఆ కేసును ఏపీ ప్రభుత్వం నీరు గార్చిందని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి మహిళ “కాల్మనీ సీఎం” అనే పరిస్థితిని తీసుకొచ్చారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.
చంద్రబాబు, లోకేష్కు సన్నిహితుడైన తానా అధ్యక్షుడు వేమన సతీష్ ను అమెరికా పోలీసులు పలుమార్లు విచారించారు. కాగా, టీడీపీలో కూడా సతీష్ వేమన క్రియాశీలకం గానే ఉంటారన్న విషయం తెలిసిందే. ‘షికాగో సెక్స్ రాకెట్ కేసు’ లో తానాకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లతో పాటు ఇటీవల వెలుగు చూసిన డైరీలో ఒక ఏపీ మంత్రి, ఒక ఎంపీ పేర్లు ఉన్నట్లు సమాచారం. అమెరికా ఎఫ్ బి ఐ పోలీసులు కోర్టులో దాఖలు చేసిన 40పేజీల అఫిడవిట్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. బాధితుల జాబితాలో 10మంది హీరోయిన్లు ఉన్నట్లు అమెరికా పోలీసులు తమ అఫిడవిట్లో పేర్కొన్నారు.
మరి చంద్రబాబు, లోకెష్ ఇరువురు జాతి గౌరవ ప్రతిష్టలకు మచ్చ తెచ్చిన తన వారు, ఈ పాపం లో బాగస్వాములైనందున జాతికి సమాధానం చెప్పుకోవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ కామ కార్యక్రమాలలో అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు ఉన్నట్లు వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. దీనికి సమాధానం చెప్పటం నైతికంగా చాలా అవసరం.