నిజామాబాద్ జిల్లా ఇందూరు గ్రామంలో అచ్చం సినీ ఫక్కీలో ప్రేమికుడిని చితకబాది అమ్మాయిని పబ్లిక్ గా ఎత్తుకెళ్లిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  వివరాల్లోకి వెళ్లితే ప్రాణదీప్, సౌజన్య కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు నో చెప్పడంతో మేజర్‌లయిన ప్రాణదీప్‌, సౌజన్య అక్కడి ఆర్యసమాజ్‌లో ప్రేమ పెళ్లి చేసుకునేందుకు వచ్చారు.

ఐదు నిమిషాల్లో పెళ్లి ముగుస్తుందనగా.. అక్కడికి వచ్చిన అమ్మాయి తరఫు బంధువులు ప్రాణదీప్‌పై దాడి చేశారు. అడ్డు వచ్చిన సౌజన్యపై కూడా చేయి చేసుకొని ఆమెను బలవంతంగా ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు.  దాంతో ప్రాణదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తానికి నిజామాబాద్ లో సంచలనం సృష్టించిన ప్రాణదీప్, సౌజన్ల పెళ్లి భగ్నం కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. పోలీసులు జోక్యం చేసుకుని ఆయన జంటను ఒకటి చేశారు.  పోలీసులు జోక్యం చేసుకుని ఆయన జంటను ఒకటి చేశారు.

రెంజల్‌ మండలం వీరన్నగుట్టకు చెందిన ప్రాణదీప్, మాక్లూర్‌ మండలం కొత్తపల్లికి చెందిన సౌజన్యలు బుధవారం ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకోబోతుండగా సౌజన్య బంధువులు దాడి చేయడం, ఆమెను బైక్ పై వేసుకుని తీసుకెళ్లడం తెలిసిందే. కలిసి చదువుకున్న ప్రాణదీప్, సౌజన్య.. తమ పెళ్లికి ఇంట్లోవారు ఒప్పుకోరని ఆర్యసమాజ్ లో ముహూర్తం చూసుకుని పెళ్లిచేసుకోవాలనుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: