ఎంత రాజకీయం చేసినా నాయకులు జనాలు కొంతైనా నమ్మేలా ప్రకటలను చేస్తే బాగుంటుంది. లేకపోతే వారే అభాసుపాలవుతారు. విశాఖ నగరం తప్ప ఎక్కడా ఉనికిలో కూడా లేని బీజేపీ శ్రీకాకుళం జిల్లాలో విజయ దుందుభి మోగిస్తుదంటే అంత కన్నా షాకింగ్ న్యూస్ వుండదేమో. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఆరు అసెంబ్లీ సీట్లను జిల్లాలో గెలిచేసుకుంటామని బీజేపీ జిల్లా నేతలు జబ్బలు చరుస్తున్నారు. 

Image result for kanna lakshminarayana

కన్నా టూర్ కే దిక్కు లేదు !
ఉత్తరాంధ్రా నుంచి ఊపేస్తాం, టీడీపీ బందారం బయటేస్తామంటూ భారీ  స్టేట్మెంట్లు ఇచ్చి మరీ శ్రీకాకుళం వచ్చిన కన్నా వెంట  పట్టుమని పది మంది కూడా జనం లేరు. ఇక రోడ్ షో అంటూ హడావుడి చేసినా పలకరించే వారే కరవయ్యారు. దీంతో ఖంగు తిన్న పెద్దాయన మీడియా మీట్లు పెట్టి బాబుని తిడుతూ టైం పాస్ చేశారు. 

Image result for pawan

పరువు తీసిన పర్యటన !
ఏదో జనంలో బలముందని, క్రౌడ్ పుల్లర్ నన్ని అతి ధీమాతో కన్నా చేసిన ఫీట్లు ఉత్తరాంధ్ర టూర్ లో రివర్స్ అయ్యాయి. టీడీపీ భరతం పట్టడం ఏమో గానీ బీజేపీ గుట్టు బయట పడిపోయింది. కేడర్ కూడా పెద్దగా లేని చోట వన్ మాన్ షో గా కన్నా టూర్ సాగింది. ఆయన వచ్చిందీ, వెళ్ళిందీ కూడా ఎవరికీ తెలియని స్థితి. మొత్తానికి బీజేపీకి సిక్కోలు దెబ్బ తో ఇక టూర్లు అంటేనే కన్నా వారు షాక్ తినేలా వుంది.

జోకులేస్తున్న లీడర్లు
విషయం ఇలా వుంటే కన్నా టూర్ తో బీజేపీ బలపడిందని, ఈసారి మెజారిటీ సీట్లు అన్నీ మావేనని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయభాస్కర్ జోకులేయడం కాడర్ కే చిర్రెత్తిస్తోంది. ఎవరి పొత్తు లేకపోతే బీజేపీకి ఓట్లు కాదు, నలుగురు మనుషులు కూడా ఇటు వైపు చూసే చాన్సే లేదన్న సంగతి కన్నా వారి దయతో బయటపడింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: