తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం కోసం జరుగుతున్న దీక్షను ఉద్దేశించి కర్ణాటక రాష్ట్రానికి చెందిన గాలి జనార్దన్ రెడ్డి చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇటీవల ఉక్కు కర్మాగారం జిల్లాలో నిర్మించడం కాదు అన్న ఓ ప్రముఖ సంస్థ చేసిన కామెంట్లకు స్పందించారు గాలి జనార్దన్ రెడ్డి.
కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మించడం సాధ్యం కాదంటూ మెకాన్ సంస్థ నివేదిక ఇవ్వడాన్ని తప్పు బట్టారు గాలి. తన బ్రహ్మణి స్టీల్స్కు కన్సల్టెంట్ మెకాన్ సంస్థేనని, ఫ్యాక్టరీ డిజైన్ కూడా ఆ సంస్థే అన్నారు గాలి.
ఇప్పటికీ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. చంద్రబాబు ప్రభుత్వం అనుమతిస్తే రెండేళ్లలో ఫ్యాక్టరీని నిర్మించి చూపిస్తానన్నారు. లేదంటే, తానింత వరకూ ఫ్యాక్టరీ కోసం ఖర్చును తిరిగి ఇచ్చేసి, రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ ఫ్యాక్టరీని నిర్మించుకోవచ్చన్నారు.