ఈ మద్య విజయవాడలోని దుర్గగుడి దేవస్థానం ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది.  ఇప్పటికే అక్కడ రాత్రి పూట క్షుద్ర పూజలు చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా  దుర్గగుడి దేవస్థానం మరో వివాదంలో చిక్కుకుంది. మహిళల కోసం నిర్మించిన డార్మెటరీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక వన్ టౌన్ లోని సీవీ రెడ్డి ఛారిటీస్ లో యాత్రికులకు విశ్రాంతి భవన సముదాయములు (డార్మెటరీలు) నిర్మించారు.
Image result for vijayawada temple
ఉచిత డార్మెటరీలు, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఏసీ డార్మెటీరీలు ఉన్నాయి.  ఉచిత డార్మెటరీలు నిర్మించడం హర్షించే విషయమే అయినా..అందులో సీసి కెమెరాలు పెట్టడం అసౌకర్యమైన విషయం అని అంటున్నారు. మహిళల డార్మెటరీల్లో సీసీ కెమెరాలు ఉండటంతో దుస్తులు మార్చుకోవాలంటే ఇబ్బందిగా ఉందని మండిపడుతున్న భక్తులు, అక్కడి సిబ్బందిని నిలదీశారు. నిర్మాణ సమయంలో అన్నిచోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టే ఈ గదుల్లో కూడా ఏర్పాటు చేశారని, ప్రస్తుతం అవి పనిచేయడం లేదని, ఎటువంటి దృశ్యాలు రికార్డు చేయడం లేదని సిబ్బంది చెప్పారు. 
Image result for vijayawada temple cc cemara
కాగా, సీసీ కెమెరాలు పనిచేయడం లేదని సిబ్బంది చెబుతున్నప్పటికీ వాటి వద్ద లైట్లు వెలుగుతుండటంతో భక్తులకు అనుమానం రావడంతో గొడవకు దిగడం గమనార్హం.మహిళ గదుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పొరపాటేమహిళ గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం ఈరోజు తమకు తెలిసిందని, ఇలా ఏర్పాటు చేయడం పొరపాటేనని అన్నారు. వాటిని తొలగిస్తామని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: