సాధారణంగా ఒక్క పాము చూస్తేనే గుండ గుభేల్ మంటుంది..అలాంటిది ఒకే చోట అత్యంత విషపూరితమైన నాగుపాములు 132 కనిపిస్తే ఆ పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉంటుంది.  కానీ అలాంటి సంఘటన నిజంగా ఒడిషా రాష్ట్రంలో వెలుగు చూసింది.  ఒక ఇంట్లో 132 నాగుపాములు ఒక్కసారే ప్రత్యేక్షం కావడంతో కుటుంబ సభ్యులు పై ప్రాణాలు పైకే పోయాయి.

భద్రక్‌ జిల్లా ధామ్‌నగర్‌ సమితి పయికోసాహి గ్రామంలో బిజయ్‌ భుయ్యా ఇంట్లో రెండు మూడు రోజుల వయస్సు గల పాము పిల్లలు భారీ మొత్తంలో ఒకే ఇంట్లో కనబడటంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. ఈ వింతను  చూసేందుకు స్థానికులు బారీగా తరలిస్తున్నారు.  అయితే భారీ మొత్తంలో కనిపించిన పాములను స్నేక్‌ హెల్ప్‌లైన్‌ ప్రతినిధులు పట్టుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: