గతంలో చిత్తూరు జిల్లాలో జరిగిన ఎన్నికల వారీగా ఒకసారి గ్రాఫ్ గమనిస్తే సొంత జిల్లా నేత అయిన స్థానిక ప్రజలు అనుకున్నంత స్థానాలు ఇవ్వలేదు చంద్రబాబు గారికి. 2004-2009 ఎన్నికల్లో అనుకున్నంత విజయం అయితే ఇక్కడ ప్రజలు ఇవ్వలేదు టీడీపీకి…2014 ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం ఇక్కడ తన విజృంభన చూపింది.. కాని ఆరుసీట్లు మాత్రమే గెలుచుకుంది… అయితే వైసీపీ కూడా జిల్లాలో 8 స్దానాల్లో విజయం సాధించింది.
14 సెగ్మెంట్లలో ఎనిమిది వైసీపీ 6 తెలుగుదేశం గెలుచుకుంది గత ఎన్నికల్లో.. అయితే ఈ ఎన్నికల్లో ఈ ఫలితాలు మరింత తారుమారు అవుతాయాని ఓ సర్వే తేల్చుతోంది..11 సెగ్మెంట్లు వైసీపీ గెలిచే అవకాశం ఉందని ఇటు టీడీపీ మూడు సీట్లతో సర్దిపెట్టుకుంటుంది అని ఆ సర్వే వైరల్ అవుతోంది.
ఇక ఎంపీలు కూడా రెండు స్ధానాల్లో తిరుపతి నుంచి వరప్రసాద్ కు విజయం మరోసారి జగన్ సీటు ఇస్తే కచ్చితమని, అలాగే మరో సెగ్మెంట్ పై టఫ్ వార్ ఉంటుంది అని తెలుస్తోంది. సో ఈ సర్వేతో కొత్త ఆలోచనలు మొదలయ్యాయట టీడీపీలో. మరోపక్క స్థానికంగానే ఇలా ఉంటే ఇక రాష్ట్రం మొత్తం దుకాణం సర్దుకోవాల్సిందే 2019 లో అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.