భారత దేశంలో కొంత కాలంగా మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కొంత మంది మృగాళ్ల చేతుల్లో హింసకు గురి అవుతూనే ఉన్నాయి.  తాజాగా సంవత్సర కాలం నుంచి తన భర్త తనను దారుణంగా వేధిస్తున్నాడని..హింసిస్తున్నాడని తేలప్రోలు టీడీపీ మహిళా సర్పంచ్‌ హరిణి గన్నవరం పోలీసులను ఆశ్రయించింది.  కృష్ణా జిల్లా తెలుగు యువత నాయకుడుగా పనిచేస్తున్న యతేంద్ర రామకృష్ణ తనను శారీరకంగా హింసిస్తూ గాయపరుస్తున్నాడని హరిణి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

‘టీడీపీ యూత్‌ లీడర్ ఓ బుకీ, పేకాటరాయుడు, అమ్మాయిలతో సంబంధాలు కొనసాగిస్తాడు. ఇలాంటి రాజకీయనాయకుల వల్ల మాకు పోలీస్‌స్టేషన్లలో కూడా న్యాయం జరగడం లేదు. ప్రభుత్వానికి చేరేంతవరకు ఈ పోస్టును షేర్‌ చేయండి. బాధితురాలు మీ సోదరి’ అని హరిణికుమారి మరో పోస్ట్‌లో భర్త వ్యసనాలు, దురలవాట్లను బయటపెట్టారు. భర్త ఫొటోను షేర్‌ చేస్తూ కనబడటం లేదని, ఎవరికైనా కనిపిస్తే తనకు తెలియజేయాలని బాధిత మహిళా సర్పంచ్‌ కోరారు.

తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. సీఐ మీద నా భర్త యతేంద్ర ఒత్తిడి తీసుకువచ్చి నాతో కేసు వాపస్‌ తీసుకునేలా చేశారు. న్యాయం జరగదని భావించి ఇలా అందరికీ నా భాద చెప్పుకుంటున్నాను. ఇక నా భర్త నన్ను ప్రాణాలతో ఉంచుతాడనే ఆశ నాకు లేదు. కనీసం పిల్లల ప్రాణాలైనా కాపాడండి. ఇలాంటి పరిస్థితి మరొక ఆడపడుచుకి రాకుండా చూడండి’ అని తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో బాధితురాలు హరిణికుమారి కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: