దేవుడు తనకు బదులుగా అమ్మను ఇచ్చి..ఆలనా పాలనా చూసుకునేలా చేశాడు.  అమ్మంటే దైవంతో సమానం అని అంటారు. ప్రపంచంలో ఏ స్వార్థం లేకుండా తన పిల్లల కోసం దేనికైనా సిద్దపడేది అమ్మా.  అలాంటి అమ్మ అనే పదానికి మచ్చ తెచ్చింది ఓ మహిళ.  సాధారణంగా అమ్మాయిలు పుడితే చాలా మంది తల్లి దండ్రులు పెదవి విరుస్తారు.  వారి కుటుంబ సభ్యులు సైతం అమ్మాయి పుట్టిందా అంటూ వెటకారంగా మాట్లాడుతున్న సమాజం.  కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది..అబ్బాయి పుట్టాడని ఏకంగా తనను చంపేసి  ఆపై తనకేమీ తెలియనట్టు కుమారుడు కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు రంగంలోకి దిగి అసలు విషయం తేల్చారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఔరంగాబాద్ జిల్లా పైఠణ్ తహసీల్ పరిధిలోని పైఠణ్‌ ఖేడ్ గ్రామంలో దేవిక ఇరాండే అనే మహిళకు ఓ కుమారుడు ఉండగా, మళ్లీ గర్భం దాల్చింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఔరంగాబాద్ జిల్లా పైఠణ్ తహసీల్ పరిధిలోని పైఠణ్‌ఖేడ్ గ్రామంలో 10 నెలల ప్రేమ్ పరమేశ్వర్ ఇరాండే అనే చిన్నారి అనుమానాస్పద రీతిలో మాయమయ్యాడు.

బాలుని తల్లి దేవిక ఇరాండే కుమారుని అదృశ్యంపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ చిన్నారి మృతదేహం దేవిక ఇంట్లోని నీటి డ్రమ్ములో ఉన్నట్లు పోలీసు జాగిలం గుర్తించింది. దాంతో పోలీసులు అక్కడ సోదా చేయగా  ఆ డ్రమ్ములోనే బిడ్డ మృతదేహం ఉండటంతో పోలీసులు దేవికను విచారించి నిజాన్ని బయటకు లాగారు. ఆమెను అరెస్ట్ చేసి రిమాండుకి తరలించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: