తాజాగా ఇటీవల కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అలాగే మిగతా టిడిపి పార్టీ రాజకీయ నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసినదే. ఈ నేపధ్యంలో కడప జిల్లాలో జిల్లా పరిషత్ ప్రాంగణంలో జరుగుతున్న ఆమరణ నిరాహార దీక్ష వేదికపై రాష్ట్రంలో ఉన్న అనేకమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం అంటూ ప్రసంగిస్తూ వైసిపి పార్టీ పై జగన్ పై లేనిపోని వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ కడప జిల్లాలో వైసీపీ పార్టీపై బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Image result for jagan rayapati
దీనికి అనుగుణంగానే ఇటీవల వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, వైసీపీ జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే అని రాయపాటి అన్నారు. జ‌గ‌న్ క‌డ‌ప స్టీల్ ఫ్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడ‌క పోవ‌డం దుర‌దృష్టక‌రం అన్నారు రాయ‌పాటి.
Image result for jagan rayapati
ఇక క‌డ‌ప స్టీల్ ఫ్లాంట్‌లోకి జ‌గ‌న్ త‌న అన్నను రంగంలోకి దించాడ‌ని గాలి జనార్దన్ రెడ్డిను ఉద్దేశించి మాట్లాడారు.కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్ధన్‌రెడ్డి అందించిన ఆర్థిక సాయానికి కడప స్టీల్‌ప్లాంట్‌ను బహుమానంగా ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. గాలి జనార్ధన్‌రెడ్డి ఈ వ్య‌వ‌హారంలోకి ఎంట‌ర్ అవ్వ‌డంతో జ‌గ‌న్ సైలెంట్ అయ్యాడ‌ని రాయ‌పాటి ఎద్దేవ చేశాడు.
Image result for jagan rayapati
ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం హవా కొనసాగుతుందని ఇది 2019 ఎన్నికల దాకా చంద్రబాబు ఆధ్వర్యంలో దూసుకెళుతోందని రాబోయే ఎన్నికలలో చంద్రబాబే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని జోస్యం చెప్పారు రాయపాటి.


మరింత సమాచారం తెలుసుకోండి: