జార్ఖండ్ లో మరో ఘోరం జరిగింది.  విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్న ఆరుగు జవాన్లను జార్ఖండ్ మావోయిస్టులు పేల్చిన శక్తిమంతమైన మందుపాతర పేల్చేశారు.  దాంతో ఆరుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. గర్హ్వా జిల్లాలో ఈ ఘటన జరిగిందని ఆరుగురు జార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్ దళ సభ్యులు మరణించారని డిప్యూటీ ఐటీ విపుల్ శుక్లా తెలిపారు. 

ఈ మద్య మావోయిస్టులను ఏరివేసే పనిలో కూంబింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాంతో ప్రత్యర్థులు కూడా తమ పన్నాగాలు పన్నుతూ జవాన్లపై ఎటాక్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో గర్హ్వా జిల్లాలో ఆరుగురు జవాన్లను పొట్టన బెట్టుకున్నారు.
Image result for Maoist attack jharkhand
జిల్లాలోని చింజో ప్రాంతంలో మావోలు సంచరిస్తున్నారని తెలుసుకుని జాగ్వార్ ఫోర్స్ అక్కడికి వెళ్లిందని, తొలుత ల్యాండ్ మైన్ ను పేర్చిన మావోలు, ఆపై కాల్పులకు దిగారని, ఈ ఘటనలో పలువురు జవాన్లకు గాయాలు అయ్యాయని వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని, ఆ ప్రాంతానికి అదనపు బలగాలు పంపించామని ఆయన తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: