మ‌హాభార‌తంలో ధ‌ర్మ‌రాజును ఆద‌ర్శంగా తీసుకున్నాడో ఏమో ? క‌ర్నూలు జిల్లాలో ఓ ప్ర‌బుద్ధుడు త‌న భార్య‌, బిడ్డ‌ల‌ను అమ్మ‌కానికి పెట్టాడు.  ఎందుకో తెలుసా ? జ‌ల్సాల‌కు అల‌వాడు ప‌డిపోయి, అందుకు డ‌బ్బులేక చివ‌ర‌కు భార్య‌, బిడ్డ‌లను అమ్మేసే స్ధాయికి దిగ‌జారాడు. త‌న‌కున్న న‌లుగురు బిడ్డ‌ల్లో ఇద్ద‌రిని పోయిన ఏడాదే అమ్మేశాడు. అయినా డబ్బులు చాల‌క‌పోవ‌టంతో తాజాగా భార్య‌తో  పాటు మిగిలిన ఇద్ద‌రు బిడ్డ‌ల‌ను అమ్మేద్దామ‌ని నిర్ణ‌యించుకున్నాడు.  


దీనికి సంబంధించిన వివ‌రాలు తెలియాలంటే  ఈ క‌థ‌నం చ‌ద‌వాల్సిందే. క‌ర్నూలు జిల్లాలోఇ కోవెల కుంట్ల‌లో బుడ‌గ‌జంగ‌మ మ‌ద్దిలేటి, వెంక‌టేశ్వ‌ర‌మ్మ దంప‌తులున్నారు.  జీవ‌నోపాధి కోసం మ‌ద్దిలేటి  ఆటో న‌డుపుతుంటాడు.  న‌డిపేది ఆటోనే అయినా జ‌ల్సాల్లో ఎందులో మ‌ద్దిలేటి త‌గ్గేదిలేదు. మ‌రి, ఆటో న‌డుపుతుంటే జ‌ల్సాల‌కు డ‌బ్బ‌కెడినుండి వ‌స్తుంది ?  అందుక‌నే అందిన  చోట‌ల్లా అప్పులు చేశాడు. ఒక‌వైపు పెరిగిపోతున్న అప్పులు, ఇంకోవైపు జ‌ల్సాల‌కు స‌రిపోని డ‌బ్బులు. చివ‌ర‌కు పెద్ద ప్లాన్ వేశాడు. పోయిన ఏడాది త‌న న‌లుగురు పిల్ల‌ల్లో ఇద్ద‌రిని రూ. 3.5  ల‌క్ష‌ల‌కు అమ్మేశాడు. 


అయితే, జ‌ల్సాలు చేసే వాళ్ళ‌కు ఎంత డ‌బ్బుంటే మాత్రం స‌రిపోతుంది ? అందుకే  రూ. 3.5  ల‌క్ష‌లు ఏమాత్రం స‌రిపోలేదు. అందుక‌నే ఈసారి భార్య‌, మిగిలిన ఇద్ద‌రు బిడ్డ‌ల‌పై క‌న్నేశాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా ముగ్గురినీ అమ్మ‌కానికి పెట్టేశాడు.  న‌లుగురు బిడ్డల్లో క‌నిపించ‌కుండా  పోయిన ఇద్ద‌రు బిడ్డ‌ల గురించి భార్య ఎంత అడిగినా మ‌ద్దిలేటి జ‌వాబు చెప్ప‌లేదు. భ‌ర్త వ్య‌వ‌హారంపై అనుమానం వ‌చ్చిన భార్య మ‌ద్దిలేటిపై నిఘా వేసింది. దాంతో విష‌యం మొత్తం బ‌య‌ట‌ప‌డింది. అంత‌క‌న్నా విచిత్రం ఏంటంటే ?  మొద‌టి ఇద్ద‌రి బిడ్డ‌ల‌ను కొనుక్కున్న‌ది కూడా మ‌ద్దిలేటి సోద‌రుడేన‌ట‌. విష‌యం మొత్తం తెలుసుకున్న భార్య మిగిలిన ఇద్ద‌రు బిడ్డ‌ల‌ను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. దాంతో మ‌ద్దిలేటి అత్తారింటికి వెళ్ళి భార్య‌తో గొడ‌వకు దిగాడు. విసిగిపోయిన భార్య పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే ప‌ట్టించుకోలేదు. దాంతో ఐసిడిఎస్ అధికారుల ద‌గ్గ‌ర‌కు వెళ్ళి విష‌యం  మొత్తం వివ‌రించింది.  క‌థ ఎంత‌వ‌ర‌కూ వెళుతుందో చూడాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: