ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఓట్ల రాజ‌కీయాలు దండిగా న‌డుస్తున్నాయి. ముఖ్యంగా అన్నివ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌దైన వ్యూహ ర‌చ‌న‌తో ముందుకు సాగుతున్నారు. ఏ ఒక్కరినీ ఆయ‌న వ‌దిలి పెట్ట‌డం లేదు. ఇక్క‌డ మ‌న‌కు గ‌త పాల‌న‌లో చంద్ర‌బాబుకు ప్ర‌స్తుత చంద్ర‌బాబుకు మ‌ధ్య భారీ వ్య‌త్యాసం క‌నిపిస్తోంది అప్ప‌ట్లో ఉద్యోగులు అంటే.. ఆయ‌న దృష్టిలో సుష్టిగా భోంచేసి వ‌చ్చి ఆఫీస్‌లో రెస్ట్ తీసుకునే బాప‌తు! ఇది ఆయ‌న‌కు సుదీర్ఘ‌కాలంలో పెద్ద చేటు తెచ్చింది. అయితే, ఇప్పుడు ఆయ‌న మారారు. 

Image result for ap employee ashok babu

మారిన బాబుగా ఉద్యోగుల‌పై వ‌రాల జ‌ల్లు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో 10 ల‌క్ష‌ల మందికిపైగా రెగ్యుల‌ర్‌, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. పెన్ష‌న‌ర్ల సంఖ్య‌కూడా దాదాపు 8 ల‌క్ష‌ల‌పైగానే ఉంది. మ‌రి వీరి ఓటు బ్యాంకు అత్యంత కీల‌కం.గ‌తంలో చేసిన త‌ప్పులే మ‌ళ్లీ చేస్తే.. వీరి ఓటు బ్యాంకు గుండుగుత్తుగా వైసీపీకి చేరిపోవ‌డం ఖాయం. దీనిని గ‌మ‌నించిన బాబు గ‌త ఆరు మాసాలుగావీరిని మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే వారు అడిగిన‌వి.. అడ‌గ‌నివి కూడా చేస్తూ.. వారిని చేర‌దీస్తున్నారు. 

Image result for chandrababu

ముఖ్యంగా ఏపీ ఎన్జీవో నేత అశోక్‌బాబును చేర‌దీయ‌డం వెనుక ఉన్న రాజ‌కీయ వ్యూహం కూడా ఇదే. అంతేకాదు, ఒకప‌క్క దేశంలో నేర‌గ‌ణాంకాల‌ను ప‌రిశీలించే జాతీయ నేర విభాగం ఎక్కువమంది అవినీతి అధికారులు ఉన్న రాష్ట్రంగా ఏపీకి ప్ర‌థ‌మ స్థానం క‌ట్ట‌బెట్టింది. ఇది తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయిన వెంట‌నే చంద్ర‌బాబు 1100 నెంబ‌రుతో ఓ ఫోన్‌ను ఏర్పాటు చేసి స‌మస్య‌ల ప‌రిష్కారం కోసం కృషి చేస్తున్నారు. 


ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఉద్యోగుల‌కు కితాబు ఇవ్వ‌డం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ నీతి, నిజాయితీలను సంపాదించుకోవాలని సూచింస్తున్నారు. పేదలను ఎక్కడా దోపిడీ చేసే పరిస్థితి ఉండకూడదు. నీతివంతమైన, అవినీతి రహిత పాలన మా ధ్యేయమ‌ని అంటున్నారు. రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రం గా తీర్చిదిద్దుతానని ప్ర‌తిజ్ఞ‌లు సైతం చేస్తున్నారు.  అవినీతిని నిరోధించడానికి టెక్నాలజీని వినియోగిస్తున్నామ‌ని చెప్పిన చంద్ర‌బాబు..  నూటికి 95 శాతం మంది నిజాయతీగానే ఉన్నారని, 5 శాతం మందిలోనే అవినీతి జబ్బుగా తయారైందని అన‌డం ద్వారా ఉద్యోగుల‌ను ఆయ‌న త‌న‌వైపు తిప్పుకొనేందుకు శ్ర‌మించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


అదేవిధంగా ఉద్యోగుల నుంచి నాయ‌కులను సైతం ఆయ‌న సెల‌క్ట్ చేసుకోవ‌డంపైనా అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఏదేమైనా.. ఉద్యోగుల ఓట్ల‌ను త‌న‌దైన శైలిలో బాబు బుట్టలో వేసుకుంటుండ‌డంపై ఉద్యోగ సంఘాలే విస్మ‌యం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: