ఈ మద్య నందమూరి బాలకృష్ణ వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు. తన వందవ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత పైసా వసూల్, జై సింహ చిత్రాల తర్వాత వివివినాయక్ తో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించబోతున్నాడు. వచ్చే నెల 5 నుంచి క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
బాలకృష్ణ నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా రాణిస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే షూటింగ్ బిజీలో ఈ మద్య తన నియోజక వర్గానికి వెళ్లకపోవడంతో కొన్ని విమర్శలు రావడం మొదలయ్యాయి. దాంతో మూడు రోజుల పాటు హిందూపురంలో ఉంటూ ప్రజల బాగోగులు చూసుకోవడానికి వెళ్లారు.
పల్లెబాట పట్టిన బాలయ్య... పల్లె నిద్రలు కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళా అభిమానులు ఆయనకు కరచాలనం చేస్తున్నారు. సాధారణంగా అభిమానుల విషయంలో ఒక్కోసారి బాలయ్య కఠినంగా ఉంటారన్న విషయం తెలిసిందే..కొన్ని సార్లు చేయి చేసుకోవడం కూడా చూశాం..కానీ పల్లె బాటలో మాత్రం చాలా కూల్ గా ఉంటున్నారు.
అంతే కాదు తన వద్దకు వచ్చిన వారితో ఎంతో మర్యాదగా మాట్లాడుతూ..వారి బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా మహిళా అభిమానులు ఆయనకు కరచాలనం చేస్తున్న సందర్భంలో చేతి వేలుకు ఉన్న ఉంగరం పడిపోయింది. ఆ విషయాన్ని ఆయన కూడా గ్రహించలేదు. ఆ తర్వాత ఓ మహిళ కింద పడిపోయిన ఉంగరాన్ని గుర్తించి, తిరిగి బాలయ్య వేలికి తొడిగింది. ఆమె నిజాయతీకి బాలయ్య ఎంతో సంతోషపడ్డారు.