అయితే ఇన్ని దాడులు జరుగుతున్న దళితులపై పటిష్టంగా ఉన్న చట్టాలు గాని పట్టించుకునే ప్రభుత్వాలు గాని చర్యలు తీసుకోకపోవడం దారుణం. తాజాగా ఇటీవల ఇటువంటి ఈ ఘటన పాట్నాలో జరిగింది. ఆహ్వానించకపోయినప్పటికీ...స్థానికంగా జరుగుతున్న వివాహ ఊరేగింపులోకి జొరబడి మరీ ఆనందంగా నృత్యాలు చేసిన ఓ దళితుడిని కాల్చి చంపేశారు.
ఇక్కడికి సమీపంలోని అభిఛప్ర గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇతర వెనుకబడిన కులానికి చెందిన ఓ కుటుంబంలో వివాహం తంతులో భాగంగా ఊరేగింపును నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన నవీన్ మాంఝీ (22) నాట్యం చేశాడు.
అదే సమయంలో అక్కడున్న వారిలో ఎవరో ఒక్కసారిగా తుపాకీ తీసి నవీన్మాంఝీని కాల్చి చంపేశారు. పాత కక్షలతో తన కుమారుడిని చంపేశారని నవీన్మాంఝీ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ ఉదంతం ఆ ప్రాంతంలో కలకలం రేపుతుంది.