తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరణకు గురైన మెత్కుపల్లి నరసింహులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై షాకింగ్ కామెంట్ చేశారు. తాజాగా ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఆంధ్ర ప్రజలు ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
Related image
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావునే మోసం చేసిన మహా మోసగాడు చంద్రబాబు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోతే ఎక్కువగా సంతోషించేది నేనే అంటూ మెత్కుపల్లి అన్నారు. చంద్రబాబుకు తప్పకుండా దళితుల ఉసురు తగులుతుంది అని అన్నారు . చంద్రబాబు ఏనాడు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని అడగలేదు.
Related image
హోదా కోసం నాలుగేళ్ళ నుండి పోరాడుతుంది ప్రతిపక్ష నేత జగన్ ఒక్కరే..ఏపీ ప్రజలకు న్యాయం చేసేది కూడా జగనే..వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలందరు జగన్ కే ఓటు వేయాలి అని అయన సంచలన వాఖ్యలు చేశారు. అంతేకాకుండా జగన్ చాలా మొండివాడని చెప్పింది చేసే వ్యక్తి అని పేర్కొన్నారు. నిజంగా గత ఎన్నికలలో జగన్ రైతు రుణ మాఫీ చేస్తానని అబద్ధపు హామీ ఇచ్చి ఉంటే ఆనాడే ముఖ్యమంత్రి అయి ఉండేవాడని అన్నారు.
Image result for jagan methkupalli
విభజనకు గురై తీవ్రంగా నష్టాలు పాలయిన ఆంధ్రరాష్ట్రం తిరిగి అభివృద్ధి బాటలో నడవాలంటే జగనే ముఖ్యమంత్రి అవ్వాలని పేర్కొన్నారు. వచ్చేనెల 11న తన జన్మదినం సందర్బంగా తిరుమల శ్రీవారి దగ్గరికి వెళ్తానని..రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుతానని మోత్కుపల్లి సంచలన వాఖ్యలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: