ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని రాబట్టుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఇప్పటికే గత ఎన్నికలలో అబద్ధపు హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని నిలువునా ముంచేశారు చంద్రబాబు అని ప్రతిపక్షనేత వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర లో ప్రజలు చెబుతూనే ఉన్నారు. అయితే మరోపక్క ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు తన పార్టీ ఎంపీల చేత నాయకులు చేత దీక్షలు అంటూ కొత్తరకం డ్రామాలకు తెర లేపారు.
Related image
తాజాగా ఇటీవల టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేత కడప జిల్లాలో  ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష అంటూ వైసీపీ పార్టీ పై లేనిపోని అభాండాలు వేయడానికి కోటానుకోట్లు ప్రజాధనాన్ని వృధా చేశారు. మరోపక్క కడప జిల్లా వాసులు అధికారంలో ఉండి కూడా దీక్ష చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల దీక్షలపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అసలు గుట్టు రట్టు అయినా విషయం మనకందరికీ తెలిసినదే...
Image result for chandrababu
ఇదిలావుండగా తాజాగా చంద్రబాబు మరో దొంగ దీక్షలకు శ్రీకారం చుట్టారు..విశాఖ రైల్వే జోన్ విషయంలో చంద్రబాబు విశాఖపట్నం వేదికగా దీక్ష చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో అనేక పోరాటాలు చేయడం జరిగింది.
Image result for chandrababu
అయినా గాని కేంద్రంలో ఎటువంటి స్పందన రాకపోవడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు విశాఖ రైల్వే జోన్ కోసం ఈనెల 4వ తేదీన విశాఖపట్నంలో దీక్ష చేపడుతున్నామని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు  చెప్పారు. దీంతో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని దీక్షలు చేసినా రాష్ట్రంలో ఉన్న ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: