వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తే ఓడిపోవ‌టంఖాయ‌మ‌ని టిడిపి అంటోంది. ఏలూరు నుండి ప‌వ‌న్ పోటీ చేసినా తానే గెలుస్తానంటూ టిడిపి ఎంఎల్ఏ బ‌డేటి బుజ్జి మీడియాతో చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పెద్ద ఫోర్స‌వుతార‌ని ఒక‌వైపు అంద‌రూ అనుకుంటుంటే ఎంఎల్ఏ బుజ్జి మాత్రం ప‌వ‌న్ ను అంత‌లా తీసిపారేయ‌టం విచిత్రంగా ఉంది. పైగా ప‌వ‌న్ సొంత జిల్లా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోనే ప‌వ‌న్ కు ఏమాత్రం బ‌లం లేద‌న్న‌ట్లుగా టిడిపి ఎంఎల్ఏ చెబుతున్నారు. ప‌వ‌నే ఓడిపోతారంటే ఇక మిగిలిన అభ్య‌ర్ధుల గురించి ఆలోచించ‌టం కూడా వేస్ట్ అన్న‌ట్లుంది టిడిపి మాట‌లు.


ఎక్క‌డ పోటీ చేసినా ఓడిపోతారు 

Related image

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఏలూరు నుంచైనా లేకపోతే ఎక్క‌డి నుండి పోటీ చేసినా స‌రే అంటూ స‌వాలు కూడా విసిరారు లేండి. 2009లో కూడా ప్ర‌జారాజ్యం పెట్టిన‌పుడు అధ్య‌క్షుడు చిరంజీవి కూడా జిల్లాలోని మొగల్తూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఓడిపోయిన సంగ‌తి అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఏదో చావు త‌ప్పి క‌న్నులోట్ట‌పోయిన ప‌ద్ద‌తిలో తిరుప‌తి నుండి మాత్రం గెలిచారు. ఇపుడు బుజ్జి చెప్పే మాట‌లు చూస్తుంటే చిరంజీవే ఓడిపోయిన‌పుడు ఇక  ప‌వ‌న్ ఎంత అన్న‌ట్లుంది.


ప‌వ‌న్  ఓట‌మే ల‌క్ష్య‌మా ?


మొత్తానికి టిడిపి నేత‌లు ఏకంగా ప‌వ‌న్ ఓట‌మినే ల‌క్ష్యంగా చేసుకున్న‌ట్లు క‌న‌బడుతోంది. మ‌రి, టిడిపి ఎంఎల్ఏ స‌వాలుకు ప‌వ‌న్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే ?  పైగా టిడిపిపై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తూ ప‌వ‌న్ త‌న విలువ‌ను కోల్పోతున్నారంటూ ఓ సెటైర్ కూడా వేశారులేండి. అప్ప‌టికేదో టిడిపి నేత‌లు మాత్రం నిఖార్సైన ఆరోప‌ణ‌లే అంద‌రిపైనా చేస్తున్న‌ట్లు బిల్డప్ ఇచ్చారు బుజ్జి. 


మరింత సమాచారం తెలుసుకోండి: