జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పాదయాత్ర ఉత్తరాంధ్రలో చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వం పై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. గత ఎన్నికలలో చంద్రబాబుకు అనుభవం ఉంది అని నమ్మి మద్దతు తెలిపానని...తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఇంత దారుణంగా అవినీతిమయం చేస్తారని కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు.
Image may contain: 6 people, people smiling, outdoor
ఇదిలావుండగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై దారుణంగా విరుచుకుపడుతున్న గాని పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకు మీడియా సపోర్ట్ లేకుండా పోయింది. దీంతో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా మెగా కుటుంబం నుండి రెండు పెద్ద తలకాయలు రంగంలోకి దిగినట్లు ఫిలింనగర్ నుండి సమాచారం.
Image result for chiranjeevi allu aravind
ఇప్పటికే వచ్చే ఎన్నికలలో పవన్కళ్యాణ్కి తమ మద్దతు ఉంటుందని రాంచ‌ర‌ణ్, అల్లుఅర్జున్, సాయిధ‌ర‌మ్ తేజ్, వ‌రుణ్ తేజ్ లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే వారి మ‌ద్ద‌తు గురించి స్పందించ‌లేదు. అయితే ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మెగా కంపౌడ్ నుంచి చిరంజీవి, అల్లు అర‌వింద్ ల మ‌ద్ద‌తు పుష్క‌లంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.
Image may contain: 8 people, people smiling, people standing and outdoor
చిరంజీవి – అల్లు అర‌వింద్ లో ప‌వ‌న్ కు తెర‌వెనుక మ‌ద్ద‌తిస్తు వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేలా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప‌వ‌న్ ప్ర‌చారానికి మీడియా అధినేత‌ల‌తో చిరంజీవి, అల్లు అర‌వింద్ పావులు క‌దుపుతున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: