ఏపిలో వైసీపీ ఎమ్మెల్యే రోజా గత కొంత కాలంగా ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా మరోసారి ఆమె ఏపి సీఎం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు రైతు ద్రోహి అని, ఆయన సొంత జిల్లాలోనే రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. 

సార్వత్రిక ఎన్నికల సమయంలో రైతుల రక్షణ కోసం కొత్త పథకాలు తీసుకు వస్తానని..రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని ఎన్నో బూటకపు వాగ్ధానాలు చేశారని..గెలిచిన తర్వాత రైతుల ముఖం  చూడని పరిస్థితి నెలకొంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మొన్న టొమాటో రైతులు, ఇప్పుడు మామిడి రైతులు రోడ్డున పడ్డారని అన్నారు.

మామిడి కాయలను రోడ్డుపై వేసి రైతులు తమ నిరసన తెలిపారని, ఈ సంఘటన చంద్రబాబు సర్కార్ కు సిగ్గుచేటని విమర్శించారు. రైతులపై చంద్రబాబు దొంగప్రేమ చూపిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: