జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గతంలో టాలీవుడ్ హీరోయిన్ శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ విషయం లో షాకింగ్ కామెంట్లు చేసిన విషయం మనకందరికీ తెలిసినదే..క్యాస్టింగ్ కౌచ్ విషయంపై హీరోయిన్ శ్రీరెడ్డి అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాతలపై దర్శకులపై అలాగే హీరోలపై చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది.
ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన కరమైన కామెంట్ చేస్తూ పవన్ కళ్యాణ్ తల్లిని కూడా తీవ్రంగా దూషించింది. దీంతో ఈ వివాదం పై అప్పట్లో తెలుగు సినిమా రంగంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ఇదిలావుండగా అప్పట్లో హీరోయిన్ శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్లను ఏబీఎన్ ఛానల్ వరుసగా కథనాలు ప్రసారం చేయడంతో పవన్ కళ్యాణ్ ఏబిఎన్ ఎండి రాధాకృష్ణపై తన ట్విట్టర్ అకౌంట్ లో తీవ్రంగా దూషించడం జరిగింది. ఈ పరిణామంతో అప్పట్లో పవన్ కళ్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని రాధాకృష్ణ కోరడం జరిగింది...
అయితే పవన్ కళ్యాణ్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో రాధాకృష్ణ కోర్టును ఆశ్రయించి తన పరువుకు భంగం కలిగే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారని దానిమూలంగా పరువు నష్టం దావా కేసు వేశారు ఆర్కే ..దీనిపై విచారించిన కోర్టు పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై నాలుగో తేదిన హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది ..