టీడీపీ లో చంద్ర బాబు నాయుడు అధ్యక్షుడు అయినా, కొంత మంది సీనియర్ నాయకులు చాలా పవర్ ఫుల్  అని చెప్పాలి. వీరు టీడీపీ  లో సీనియర్ ఎన్టీఆర్ కాలం నుంచి ఉన్నవారు. అయితే ఇప్పడూ ఈ మంత్రులు చేస్తున్న యవ్వారాలు బాబును ఇరకాటం లో పడేస్తున్నాయి. అయితే టీడీపీ సీనియర్ మోస్ట్ నాయకుడు అయినా అయ్యన్నపాత్రుడు విశాఖ భూ కుంభకోణం లో సంచలన వ్యాఖ్యలు చేసినాడు. అయ్యన్నపాత్రుడికి మరో మంత్రి గంటా శ్రీనివాసరావుతో సత్సంబంధాలు లేవనే సంగతి జగమెరిగిన సంగతి.

Image result for chandra babu

ఇటీవలి కాలంలో పార్టీమీద అలిగి, ఇంటికి పరిమితం అయిపోయిన గంటా శ్రీనివాసరావును బుజ్జగించడానికి చంద్రబాబు నానా పాట్లు పడాల్సి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో తనకు వ్యక్తిగత వైరం ఏమీ లేదని అంటూనే... అటు గంటాను దెబ్బకొట్టేలా.. మంత్రి అయ్యన్న పాత్రుడు చంద్రబాబునాయుడును ఇరుకున పెట్టేశారు. విశాఖలో చోటు చేసుకున్న వేల కోట్ల రూపాయల భూకుంభకోణానికి సంబంధించి... ఆరోపణలు బయటకు వచ్చిన వెంటనే సిట్ ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు సర్కారు భేషుగ్గా పనిచేసింది.

Image result for chandra babu

ఆ సిట్ కూడా అంతకంటే భేషుగ్గా పనిచేసి నివేదికను సమర్పించిందనే అందరూ అంటూ ఉంటారు. అయితే ఇదే కుంభకోనంలో ప్రమేయం ఉన్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. తాజాగా సొంత మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా ప్రజల్లో నమ్మకం కలగాలంటే సిట్ నివేదికను బయటపెట్టాలని చంద్రబాబుకు లేఖ రాసినట్టు చెప్పారు. నివేదిక బయటపెట్టకపోతే చంద్రబాబు నిజాయితీ మీద ప్రజలకు సందేహాలు కలుగుతాయి. బయటపెడితే గంటా పాత్రతో పాటు, చంద్రబాబు తనయుడు లోకేష్ కు ఉన్న వాటాల సంగతి కూడా బయటకు వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: