విజయవాడలోని వుడా కాలనీలో దారుణం జరిగింది. ఐటీఐ విద్యార్థినిపై నలుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడింది సహచర విద్యార్థులే.  కాగా, తెదేపా ఆధ్వర్యంలో పాయకాపురంలో బుధవారం జరుగుతున్న పాదయాత్రకి బందోబస్తుగా వెళ్లిన పోలీసులు.. నలుగురు యువకులతో కలిసి యువతి (19) ఉడాకాలనీ కరకట్ట ప్రాంతంవైపు వెళ్తున్నట్లు గమనించి వారిని విచారించారు.

నిందితులు యువతికి మత్తు మందు ఇచ్చి ఉండటంతో ఆమె మగతగా సమాధానాలు చెప్పడం, బాధితురాలు ఒంటిపై సరిగా దుస్తులు లేకపోవడాన్ని గమనించిన పోలీసులు ఆ యువకులను తమదైన శైలిలో అడగడంతో నిజం చెప్పారు. గుణదల ప్రాంతానికి చెందిన యువతి పాలిటెక్నిక్ చదివింది.

ఆమెతో పరిచయం ఉన్న ఓ విద్యార్థి మరో ముగ్గురు చదువు మానేసిన యువకులతో కలిసి యువతిని బుధవారం సాయంత్రం ఉడాకాలనీ కరకట్ట ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ యువతికి మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే  అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినికి మత్తు మందు లేదా మాత్రలు ఇచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: