అదృష్టం కలిసివస్తే..ఎవ్వరూ ఆపలేరు అంటారు.  నిజంతా కొంత మందికి జీవితంలో ఊహించని రీతిలో అదృష్టం కలిసి వస్తుంది.  ప్రపంచంలో నలు మూలల నుంచి పొట్టకూలి కోసం దుబాయ్ వెళ్తున్న విషయం తెసిందే.  తాజాగా ఓ కేరళా యువకుడికి దుబాయ్ నుంచి స్వదేశం రావాలని నిర్ణయించుకున్న సమయంలో అదృష్ట లక్ష్మి అతని తలుపు తట్టింది.
Image result for lottery
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.13.5 కోట్ల లాటరీ తగిలింది.  ఆ అదృష్టవంతుడు కేరళ వాసి టోజో మాథ్యూ(30).  కెరళాకు చెందిన  టోజో మాథ్యూ   అబుదబీలో సివిల్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.  అబుదబీ విమానాశ్రయంలో ఆయన కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌ నెలవారీ బిగ్‌ టికెట్‌ రాఫెల్‌ డ్రాలో దాదాపు రూ. 13.1 కోట్లు(7 మిలియన్ల దిర్హమ్‌లు) గెల్చుకున్నట్టు‘ ఖలీజ్‌ టైమ్స్‌’  వెల్లడించింది.
Digital E Lottery vs Paper Lottery
భారత్‌కు పయనమవుతూ జూన్‌ 24న అబుదబీ విమానాశ్రయంలో టికెట్‌ కొన్నాను. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న నా భార్యతో కలిసుండాలన్న ఉద్దేశంతో దుబాయ్‌ను వదిలిపెట్టాలనుకున్నా. లాటరీలో భారీ మొత్తంలో డబ్బు వచ్చిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కేరళలో సొంత ఇల్లు కట్టుకోవాలన్నది నా చిరకాల స్వప్నం.

ఈ లాటరీతో నా కల తీరనుంద’ని టోజో మాథ్యూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా,   మంగళవారం తీసిన డ్రాలో ఆయనతో మరో  9 మంది లాటరీ గెలుచుకున్నారు. ఆ తొమ్మింది మంది లో ఐదుగురు భారతీయులే కావడం మరో విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: