భారత దేశంలో స్త్రీని దేవతగా పూజిస్తారు..ఇక్కడ కట్టూ, బొట్టూ చూసి విదేశీయులు సైతం ఫిదా అవుతారు..అందుకే భారతీయ సంస్కృతి అంటే ఎంతో మెచ్చుకుంటారు.  కానీ ఈ మద్య భారత దేశంలో మహిళలకు పట్టపగలు బయటికి వెళ్లాలన్నా గుండెల్లో వణుకు పుడుతుంది.  గత కొంత కాలంగా మహిళలపై కామాంధులు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ వార్తల్లో మహిళలపై, వృద్దులపై చివరకు చిన్నారులపై కూడా మృగాళ్లు రెచ్చిపోయి అత్యాచారాలకు పాల్పపడుతున్నారు. 

తాజాగా ఓ మహిళను లైంగికంగా వేధించిన ముగ్గురు నిందితులను ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ పోలీసులు అరెస్టు చేశారు.  అత్యంత పాశవికంగా అడవిలోకి లాక్కెళ్లి ఆమె చేతులు కట్టేసి అత్యాచారానికి వడిగట్టాలని చూశారు.  అన్నా మీకు దండం పెడతా..అంటూ ఆమె వారికి ఎంతో బ్రతిమిలాడినా ఆ మృగాళ్లు వినకుండా ఆమెను తీసుకు వెళ్లారు.  ఈ తతంగం అంతా మరో దుర్మార్గుడు షూట్ చేశాడు. ఆమెను అసభ్యకర పదజాలంతో దూషించారు. తమకు లొంగకపోతే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ.. ఈ తతంగమంతా షూట్ చేస్తున్న మరొక వ్యక్తి ఆమెను బెదిరించాడు. 

ఆ మహిళ వేడుకుంటున్నా వదిలి పెట్టకుండా వేధించినట్లు తమకు లభించిన వీడియో పుటేజీలో ఉందని పోలీసులు తెలిపారు. ఆమెను బలవంతంగా లాక్కెళుతూ చెప్పులతో కొట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఆధారంగా ఉన్నావ్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరొకడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. గతంలో ఇదే ప్రాంతలో గతంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. వరుసగా ఉన్నావ్ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మహిళల రక్షణపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: