అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి అని అలాగే తన రాజకీయ లబ్దికోసం ఎదుటివారు ఎంతటి వారైనా బురద జల్లి పెద్దపెద్ద తలకాయల మెప్పు పొందాలనే మనస్తత్వం కలిగిన మనిషి అని చాలామంది రాజకీయ నాయకులు అంటారు.
ఇందులో భాగంగానే ఇటీవల కడపలో తెలుగుదేశం నాయకులు ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేసిన ఆమరణ దీక్షలో వైసిపి నేత ప్రతిపక్ష నేత జగన్ పై నోటికి ఇష్టం వచ్చినట్లు గా మాట్లాడి చంద్రబాబును సంతోష పెట్టే విధంగా వ్యవహరించారు జేసీ దివాకర్ రెడ్డి. ఇదిలా ఉండగా గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి తాజాగా ఇటీవల అనంతపురం జిల్లాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో వెల్లడించారు..
ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలాసార్లు మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాహూల్ వివాహ విషయంలో అనేక సలహాలు ఇచ్చేవాడినని చెప్పారు. రాహుల్ కు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ బ్రాహ్మణ కుంటుంబానికి చెందిన అమ్మాయితో వివాహం చేస్తే ఉత్తరప్రదేశ్ లో ఉన్న బ్రాహ్మణ ఓట్లన్ని కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉంటాయని చెబితే తన మాటలను సోనియా గాంధీ పట్టించుకోలేదని జేసి దివాకర్ రెడ్డి ఆరోపించారు.