ఈ మద్య సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను రుజువు చేస్తే ఉరి వేసుకోవడానికి సిద్ధమని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ సవాలు విసిరారు. ఒకవేళ అవే నిజమని నిరూపిస్తే..ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఉరేసుకుంటానన్నారు.   మంచిర్యాలకు చెందిన బోయిని సంధ్య, బోయిని విజేతలు అక్కాచెల్లెళ్లని సుమన్ పేర్కొన్నారు.
Image result for balka suman family
సంధ్య తనను మోసం చేయాలని ఆరు నెలల క్రితమే ప్లాన్ చేసిందని అన్నారు. గతంలో తన భార్య, కుమారుడితో తీయించుకున్న ఫోటో ఎలాగో తీసుకొని దాన్ని మార్ఫింగ్ చేయించి..తనను బ్లాక్ మెయిల్ కూడా చేసిందన్నారు. ఈ ఏడాది జనవరి 27నే ఆమెపై ఫిర్యాదు చేసినట్టు సుమన్ వివరించారు. బ్లాక్ మెయిల్ నేరంపై ఫిబ్రవరి 6న వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో కూడా హాజరు పరిచారని ఎంపీ గుర్తు చేశారు.

అయితే మరోసారి ఈ ఇద్దరు అక్కాచెల్లెలు లైంగిక ఆరోపణలు చేసి తమను బలవంతం చేశారని లేని పోని ఆరోపణలు సృష్టించి తనను బ్లాక్ మెయిల్ చేయాలని చూశారని దీంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సుమన్ తెలిపారు. 
Image result for balka suman family
కాగా,  సుమన్ వచ్చిన లైంగిక ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని మంచిర్యాల సీఐ మహేశ్ తెలిపారు. బాధితులుగా చెబుతున్న సంధ్య, విజితలు చూపిస్తున్న ఆధారాల్లో నిజం లేదన్నారు. ఫొటోను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడినట్టు విచారణలో తేలిందని సీఐ పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: