ఈ మద్య వివాహబంధానికి విలువల్లేకుండా పోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  పెళ్లినాటి బాసలు అన్నీ మరిచి కొంత మంది వివాహేతర సంబందాలు కొనసాగిస్తూ..సమాజం తలదించుకునేలా చేస్తున్నారు.  మరీ దారుణమైన విషయం ఏంటంటే..ఈ మద్య ప్రియుడి మోజులో పడి కొంత మంది మహిళలు భర్తలను దారుణంగా చంపించిన ఘటనలు జరిగాయి. 

తాజాగా ఓ భర్త వేరే మహిళ మోజులో పడి భార్యా పిల్లలను పట్టించుకోకుండా నానా హింసలు పెట్టడంతో భార్య ఎదురు తిరిగి అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చితకబాధింది. వివరాల్లోకి వెళితే..యాదాద్రి కలెక్టరేట్ లో ఏవోగా పనిచేస్తూ హరిప్రసాద్ ఇటీవలే సస్పెండ్ కూడా అయ్యాడు. నిర్మల అనే మహిళతో ఆయనకు 2002లో వివాహం జరిగింది. గత రెండేళ్లుగా వేరే మహిళతో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదే సమయంలో కుటుంబాన్ని వేధించడం మొదలు పెట్టాడు. 

తన కుమారుడికి యాక్సిడెంట్ అయినా.. చూడ్డానికి రాకుండా రాత్రంతా ఆమెతోనే ఉన్నాడని చెప్పింది. విసిగిపోయిన్ ఆమె తన బంధువులతో కలసి భర్త ఉన్న చోటుకు వెళ్లిన భార్య... ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అంతేకాదు, పోలీసులకు అప్పగించింది.  ఈ ఘటన   యాదాద్రి జిల్లా భువనగిరిలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆమె మోజులో తనను హింసిస్తున్నాడంటూ వాపోయింది. కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని మండిపడింది.  తన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: