మద్దతు తెలిపిన పార్టీ ని మోసం చేసి గత ఎన్నికలలో అండగా నిలబడిన ఆంధ్ర ప్రజలను నిలువునా ముంచేసిన బిజెపి.. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంపై చిలక పలుకులు పలుకుతోంది అన్ని అంటున్నారు టిడిపి నాయకులు. ఇట్టివల బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అయిన కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమని కన్నా పేర్కొన్నారు...దీంతో కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు తెలుగుదేశం నేతలు...
Image result for bjp
గత ఎన్నికలలో విభజనకు గురై నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రం మోడీ ని నమ్మి బిజెపి పార్టీకి తెలుగుదేశం పార్టీ వల్ల మద్దతు తెలపడం జరిగింది..ఈ క్రమంలో నష్టపోయిన రాష్ట్రానికి అండగా ఉండాల్సిన బిజెపి తమ రహస్య రాజకీయ ఎజెండాను రాష్ట్రంలో అమలుచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబునాయుడుని తీవ్ర ఇబ్బందులు పాలు చేసింది అని పేర్కొన్నారు...
Image result for bjp chandrababu
ఇంత దారుణంగా రాష్ట్రాన్ని మోసం చేసిన బిజెపి పార్టీకి రాష్ట్ర ప్రజలు ఓటు వెయ్యాలి అని కన్నా లక్ష్మీనారాయణ ప్రకటనలు చేయడం విడ్డూరమని అంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. అసలు అమలుచేయలేని హామీలు గుప్పించి రాష్ట్ర ప్రజలను నమ్మించి తమ రాజకీయ స్వార్థం కోసం రాజకీయ భవిష్యత్తు కోసం రాష్ట్రానికి రావాల్సిన ప్రతి విభజన హామీలు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ పెద్దల కాళ్ళ దగ్గర పెట్టేసి ఇప్పటిదాకా దర్జాగా ఏ తప్పు చేయని రాజకీయ నాయకుడిగా వ్యవహరించడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు వైసీపీ నాయకులు...
Image result for bjp chandrababu
నిజానికి తెలుగుదేశం పార్టీకి బీజేపీపై అంతా వ్యతిరేకత ఉంటే గతంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో అవిశ్వాస బిల్లు వైఎస్ఆర్సిపి ఎంపీలు ప్రవేశపెట్టినప్పుడు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు...నిజంగా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అసలు డ్రామాలు మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అని మండిపడుతున్నారు వైసిపి నాయకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: