ఈజి మనీ కోసం కొంత మంది అడ్డదార్లు తొక్కుతున్నారు. గ్రామాల నుంచి కొంత మంది యువతులను రప్పించి మసాజ్ సెంటర్లు, అపార్ట్ మెంట్స్ అద్దెకు తీసుకొని గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. గతంలో హైటెక్ వ్యభిచారంలో సినీతారలు, టీవి ఆర్టిస్ట్ లు కూడా అడ్డంగా బుక్ అయిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన జనార్దన్ గతంలో ఆ ప్రాంతానికి చెందిన అమ్మాయిలను నగరానికి తరలించి వ్యభిచారం నిర్వహిస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన ఓ బాలీవుడ్ నటిని రప్పించాడు. శనివారం నిర్వహించిన తనిఖీల్లో వ్యభిచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులతో పాటు, నిర్వాహకుడిని అరెస్టు చేశారు. సైనిక్పురికి చెందిన అమిత్ మహేంద్ర అనే విటుడిని హోటల్ లో వ్యభిచారం జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. సికింద్రాబాద్ పద్మారావునగర్కు చెందిన జనార్దన్రావు రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
పక్కా వ్యూహంతో నిఘా పెట్టిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు తన సిబ్బందితో కలిసి హోటల్లో తనిఖీ చేయగా రూ.40,400 నగదుతో పాటు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, వ్యభిచారం చేస్తున్న బాలీవుడ్ నటి, విటుడితో పాటు సూత్రధారి జనార్దన్రావును అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.