ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చనిపోయే స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి కేంద్రంలో రెండుసార్లు యూపీఏ ప్రభుత్వం ఏర్పడటానికి కారకుడైన దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ నేతలు వైఎస్సార్ అభిమానులు తమ అభిమానాన్ని రాజశేఖర్ రెడ్డి పై ఉన్న గౌరవాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.
Related image
అభిమానులు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు మాత్రమే గాక చాలామంది ప్రముఖులు కూడా వైయస్సార్ పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన కమీడియన్ పృద్వి వైయస్ రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానాన్ని వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మీడియాతో ముచ్చటించారు....పంచెక‌ట్టుకు, తెలుగుద‌నానికి, చిరున‌వ్వుకు బ్రాండ్ అంబాసిడ‌ర్ దివంగ‌త ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అని ప్రముఖ సినీ న‌టుడు పృథ్వీరాజ్ అన్నారు.
Image result for ysr jagan
తాను చూసిన రాజ‌కీయ నాయ‌కుల్లో దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్‌, వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఇద్ద‌రూ త‌న‌కు ఇష్ట‌మ‌ని చెప్పారు. నాడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాద‌యాత్ర చేస్తే ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టార‌ని, నేడు ఆయ‌న కుమారుడు వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు కూడా అంత‌కు మించిన రీతిలో ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌న్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి భౌతికంగా మ‌న మ‌ధ్య‌న లేకపోయినా.. ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్ర‌జ‌లు, ఇత‌ర దేశాల్లోని తెలుగు వారు సైతం వైఎస్ఆర్‌ను మ‌రిచిపోకుండా ఆయ‌న జ‌యంతిని ఎంతో ఘ‌నంగా జ‌రుపుకోవ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు.
Image result for ysr jagan
వైఎస్ఆర్ లానే జ‌గ‌న్ కూడా మాట త‌ప్ప‌ని, మ‌డ‌మతిప్ప‌ని యోధుడులా పాల‌న కొన‌సాగిస్తార‌ని వచ్చే ఎన్నికలలో వైఎస్ జగన్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని అంతేకాకుండా రాజకీయాలలో తండ్రికి మించిన తనయుడు జగన్ అవుతారని దీని చూస్తూ స్వర్గంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి పొంగిపోతారు అని జోస్యం చెప్పారు సినీ న‌టుడు పృథ్వీరాజ్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: