ఇప్పటికే కుటుంబం నుండి తండ్రి చంద్రబాబు మామ బాలకృష్ణ రాయలసీమ ప్రాంతం నుండి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ వాళ్లకు లాగా రాయలసీమ ప్రాంతం నుండి పోటీ చేస్తారా లేకపోతే కోస్తా ప్రాంతం నుండి పోటీ చేస్తారా అన్న విషయంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి..
అయితే ఈ క్రమంలో నారా లోకేష్ పోటీచేసే నియోజకవర్గం గురించి అనేక వార్తలు వినబడుతున్నాయి తెలుగుదేశం పార్టీ నుండి..ప్రధానంగా వినిపిస్తున్న నియోజకవర్గాల్లో కుప్పం, హిందూపురం, పెనమలూరు, గుడివాడ పేర్లు ఉన్నాయి. ఈ విషయంలో లోకేశ్ ఎక్కడి నుంచి బరిలో దిగుతారనేది మరికొన్నాళ్లకుగానీ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
ఒకే ఇంట్లో మూడు టిక్కెట్లు అంశంపైనా తర్జనభర్జన పడుతున్నట్టు కనిపిస్తోంది. ఒకే కుటుంబం నుంచి చంద్రబాబు, బాలకృష్ణ , లోకేశ్ ఎన్నికల బరిలోకి దిగితే మూడు సీట్ల కేటాయింపు సాధ్యం అవుతుందా? లేదంటే ఎవరినైనా పరోక్షంగా చట్ట సభల్లోకి తీసుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. మరోపక్క చంద్రబాబు రాబోయే ఎన్నికల కోసం పోటీలో నిలిపే అభ్యర్థుల ఎంపికపై రహస్యంగా ఓ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.